Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

మై లార్డ్‌’ అని అనడం ఆపండి..

Must read

తెలంగాణ వీణ , జాతీయం : కోర్టులో విచారణ సందర్భంగా న్యాయవాదులు పదే పదే న్యాయమూర్తులను ‘మై లార్డ్‌’, ‘యువర్‌ లార్డ్‌షిప్స్‌’ అని సంబోధించడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అసంతృప్తి చెందారు. ఆ సీనియర్‌ న్యాయవాది అలా అనడం ఆపితే తన జీతంలో సగం ఇస్తానని అన్నారు. బుధవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏఎస్‌ బొపన్న, పీఎస్‌ నరసింహతో కూడిన ధర్మాసనం ఒక పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది పలుమార్లు ‘మై లార్డ్‌’, ‘యువర్‌ లార్డ్‌షిప్స్‌’ అని న్యాయమూర్తులను సంబోధించారు.

కాగా, బ్రిటీష్ బానిస వలస పాలన నాటి ఈ పదాలు వాడకంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పీఎస్‌ నరసింహ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మై లార్డ్స్‌’ అని ఎన్నిసార్లు చెబుతావు. ఇలా చెప్పడం మానేస్తే నా జీతంలో సగం ఇస్తా’ అని ఆ సీనియర్‌ న్యాయవాదితో అన్నారు. ‘‘మై లార్డ్స్‌’ కు బదులుగా ‘సర్‌’ అని ఎందుకు అనకూడదు’ అని ప్రశ్నించారు. ‘మై లార్డ్స్’ అని ఆ సీనియర్‌ లాయర్‌ ఎన్నిసార్లు అంటారో తాను లెక్కపెడతానని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు ఏ న్యాయవాది కూడా న్యాయమూర్తులను ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్‌షిప్’ అని సంబోధించ కూడదన్న తీర్మానాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2006లో ఆమోదించింది. అయినప్పటికీ న్యాయవాదులు దానిని పాటించడం లేదు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you