Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 కంటకాపల్లి రైలు ప్రమాదం

Must read

తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు 15 మంది మరణించగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. సహాయక బృందాలు 13 మృతదేహాలను వెలికితీశాయి. వారిలో విశాఖ-రాయగడ ప్యాసింజర్‌లోని ఇద్దరు లోకో పైలట్లు , పలాస ప్యాసింజర్‌ గార్డు ఎంఎస్‌ రావు కూడా ఉన్నారు. మృతదేహాలను విజయనగరం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

కాగా, ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో దక్షిణ మధ్య రైల్వే, వాల్తేరు, తూర్పుకోస్తా రైల్వే, ఇతర విభాగాల సిబ్బంది వెయ్యి మందికిపైగా పాల్గొంటున్నారు. దెబ్బతిన్న ట్రాక్‌ను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు. ప్రమాదానికి గురైన బోగీలను ట్రాక్‌పై నుంచి తొలగించి అక్కడి నుంచి తరలిస్తున్నారు. ప్రమాద ఘటనపై అన్ని విభాగాల అధికారులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you