తెలంగాణ వీణ , జాతీయం : ఆడుతూ పాడుతూ స్కూలుకు వెళ్లే వయసులోనే ఓ చిన్నారి హిమాలయ పర్వతాన్ని అధిరోహించింది. అదీ తక్కువ సమయంలో పూర్తిచేసి రికార్డులకెక్కింది. తన వయసు పిల్లలు పది రోజులు కష్టపడితే కానీ ఎక్కలేని శిఖరాన్ని ఏడు రోజుల్లోనే చేరుకుంది. తల్లిదండ్రులతో కలిసి అడుగులేస్తూ ట్రెక్కింగ్ పూర్తిచేసింది. ఆ చిన్నారి మన హైదరాబాదీ కావడం విశేషం.
ఈ ట్రెక్కింగ్ పోగ్రాం కోసం ఆర్షికి స్వయంగా ఆరు నెలల పాటు శిక్షణ అందించినట్లు వివరించారు. అయితే, ఇదంతా సులభంగా ఏమీ జరగలేదని ఆర్షి తల్లిదండ్రులు చెప్పారు. ట్రెక్కింగ్ ప్రారంభించిన రెండో రోజే ఇబ్బందులు మొదలయ్యాయని వివరించారు. తొలుత వర్షం ఇబ్బంది పెట్టగా తర్వాత బలమైన గాలులు, హిమపాతం రూపంలో సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. అయినా పట్టుదలతో ముందుకే వెళ్లామని చెప్పారు.