Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

నేడే కేసీఆర్‌ రాక

Must read

తెలంగాణ వీణ , జనగాం : బీఆర్‌ఎస్‌ అధి నేత, సీఎం కేసీఆర్‌ సోమవారం జనగామకు వస్తున్నారు. సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జిల్లాకేం ద్రంలో జరిగే ప్రజాఆశీర్వాద సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన జనగామకు చేరుకుంటా రని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం సభ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొట్టమొదటి బహిరంగ సభ కావడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ సవాల్‌గా తీసుకుంది. జనగామ నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా జనసమీకరణకు ప్లాన్‌ చేసింది. కేసీఆర్‌ సభకు లక్ష మందిని తరలిస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ చెబుతోంది. దీనికి సంబంధించి వాహనాలను సమకూరుస్తున్నారు.

కేసీఆర్‌ సభ కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. జిల్లా కేంద్రంలోని సిద్ధిపేట రోడ్డుకు ఉన్న 18.23 ఎకరాల మెడికల్‌ కాలేజీ స్థలంలో సభను ఏర్పాటు చేస్తున్నారు. సభా వేదికతో పాటు ముఖ్యులు కూర్చునేందుకు జర్మన్‌ టెక్నాలజీతో కూడిన టెంటు వేశారు. ఇందులో సుమారు 10వేల మంది కూర్చునే అవకాశం ఉంది. 200మంది కూర్చునేలా భారీ వేదికను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ప్రజల కోసం భారీ టెంట్లు వేశారు. సభకు లక్ష మంది వస్తారని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. వారి కోసం 2లక్షల మజ్జిగ, 2లక్షల వాటర్‌ ప్యాకెట్లను అందు బాటులో ఉంచారు. ఎండ తీవ్రత వల్ల ఎవరైనా సొమ్మసిల్లి పడిపోతే ప్రథమ చికిత్స అందించేందుకు రెండు ఆంబులెన్సులను సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్‌ రాక కోసం సభా ప్రాంగణానికి 200మీటర్ల దూరంలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. అక్కడ దిగిన తర్వాత కేవలం 4 నిమిషా ల్లోపే సభావేదిక పైకి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

వివిధ మండలాల నుంచి వచ్చే ప్రజలు తమకు కేటాయించిన పార్కింగ్‌ స్థలాల్లో వాహనాలను నిలిపి సభ ప్రాంగణానికి చేరుకుంటారు. కాగా. జనగామ పట్టణానికి చెందిన వారంతా జనగామ చౌరస్తాకు చేరుకొని అక్కడి నుంచి డప్పు చప్పుళ్లు, ఒగ్గు కళాకారుల, కోలాట కళాకారు ల విన్యాసాల మధ్య సభా ప్రాంగణానికి చేరుకుంటారు.

కేసీఆర్‌ సభ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సభాప్రాంగణాన్ని, హెలి ప్యాడ్‌ నుంచి వేదిక వద్దకు వచ్చే మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబ్‌స్క్వాడ్‌ టీముల తో తనిఖీలు చేపట్టారు. సభ వేదిక వద్ద ఏర్పా ట్లను ఇంటెలిజెన్స్‌ విభాగం పోలీసులు ఆదివారం పరిశీలించారు. ఇద్దరు డీసీపీలు, ఏడుగురు ఏసీపీలు, 20 మంది సీఐలు, 55 మంది ఎస్సైలు, 107 మంది ఏఎస్సై, హెడ్‌ కానిస్టే బుళ్లు, 97 మంది హోంగార్డులు, 97 మంది క్విక్‌ రెస్పాన్స్‌ బృందాలు బందోబస్తులో పాలుపంచుకుంటున్నాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you