Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా బ‌రిలో రామాయ‌ణ్ న‌టుడు

Must read

తెలంగాణ వీణ , జాతీయం : సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌పై 2008 రామాయ‌ణ్‌లో హ‌నుమాన్ పాత్ర‌ధారి విక్ర‌మ్ మ‌స్త‌ల్‌ను కాంగ్రెస్ బ‌రిలో దింపింది. బుధ్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వీరిద్ద‌రూ త‌ల‌ప‌డ‌నున్నారు.

ఈ ఏడాది జులైలో కాంగ్రెస్‌లో చేరిన మ‌స్త‌ల్‌ను కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల ర‌ణ‌క్షేత్రంలో దింపింది. క‌మ‌ల్ నాథ్ స‌మ‌క్షంలో మ‌స్త‌ల్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక బీజేపీ ఇటీవ‌ల విడుద‌ల చేసిన నాలుగో జాబితాలో చౌహాన్ బుధ్ని నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేస్తార‌ని వెల్ల‌డించింది. బుధ్ని నియోజ‌క‌వ‌ర్గం చౌహాన్‌కు కంచుకోట‌గా పేరొందింది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో చౌహాన్ ఈ సీటు నుంచి ఏకంగా 58,999 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక కాంగ్రెస్ జాబితాలో పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ క‌మ‌ల్‌నాధ్‌కు చింద్వారా స్ధానం ద‌క్కింది. మాజీ సీఎం దిగ్విజ‌య్ సింగ్ కుమారుడు జైవ‌ర్ధ‌న్ సింగ్ రాఘ‌వ‌ఘ‌డ్ స్ధానం నుంచి చోటు ద‌క్కింది. ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం కొలువుతీరినా ఆపై క‌మ‌ల్‌నాధ్ స‌ర్కార్ కుప్ప‌కూల‌డంతో శివ‌రాజ్ సింగ్ చౌహాన్ సార‌ధ్యంలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటైంది.ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు న‌వంబ‌ర్ 17న ఒకే విడ‌త‌లో ముగియ‌నుండ‌గా డిసెంబ‌ర్ 3న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you