Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

నందికంటి శ్రీధర్ సమక్షంలో పార్టీలో చేరిన ఆటో యూనియన్ నేతలు

Must read

తెలంగాణ వీణ, హైదరాబాద్ : బీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారనీ ఎంబీసీ ఛైర్మన్ నందికంటి శ్రీధర్ తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గం మౌలాలీలో యూసిఫ్ ఆధ్వర్యంలో 40 మంది ఆటో యూనియన్ నాయకులు నందికంటి శ్రీధర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువాలతో శ్రీధర్ వారిని పార్టీలోని ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫార్టీని బారీ మెజార్టీతో గెలింపించాలని నందికంటి శ్రీధర్ కోరారు. ఈ సందర్బంగా పలు కాలనీల్లో పర్యటించి పార్టీని బలపర్చాలని అభ్యర్థించారు. కాలనీ సంక్షేమ సంఘాలతో చర్చించారు. కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ, అమీనద్ధీన్ , వంశీ ముదిరాజ్, భాగ్యనందారావ్, ఉస్మాన్, జోగు శ్రీనివాస్ , కిరణ్, వి శ్రీనివాస్ గౌడ్, అలీ, రాములు, సురేష్ యాదవ్ లు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you