Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

పదేళ్ల అభివృద్ధితో ప్రజల్లోకి..

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపై ఇన్‌చార్జిలకు దిశా నిర్దేశం చేశారు. పదేళ్ల పాలనలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతీ ఒక్కరితో మమేకమయ్యేలా పార్టీ ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికలు కేవలం హామీలిచ్చేందుకు వేదికలు మాత్రమేనని, బీఆర్‌ఎస్‌కు మాత్రం తాము చేసిన అభివృద్ధిని వివరించే అద్భుత అవకాశమన్నారు. ఇన్‌చార్జిలు తక్షణమే రంగంలోకి దిగి ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు బాధ్యత తీసుకోవాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

రాబోయే 45 రోజులపాటు నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. క్షేత్రస్థాయిలో బూత్‌ కమిటీల నిర్వహణ మొదలుకొని నియోజకవర్గ స్థాయి వరకు అన్ని దశల్లో ప్రచారం పకడ్బందీగా ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని, ఆ దిశగా ఈ 45 రోజులపాటు విస్తృతంగా పనిచేయాలని ఇన్‌చార్జిలకు హరీశ్‌ విజ్ఞప్తి చేశారు. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you