Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కేసీఆర్, జగన్ కలిసినప్పుడు.చంద్రబాబు, పవన్ కలిస్తే తప్పేంటి?

Must read

తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ, జనసేన పొత్తుపై వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ తో జగన్ కలవడాన్ని వైసీపీ నేతలు గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన అన్నారు. కేసీఆర్, జగన్ కలిసినప్పుడు… చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ ఎందుకు ఉలిక్కి పడుతోందని ఎద్దేవా చేశారు.

కుటుంబ విలువల గురించి ఎన్టీఆర్ బిడ్డలకు బాగా తెలుసని… అందుకే లోకేశ్ ను అమిత్ షా వద్దకు పురందేశ్వరి తీసుకెళ్లారని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేశ్ ను ఇబ్బంది పెడుతున్నారని.. అలాగే తన సోదరి భువనేశ్వరిని, కోడలు బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెడుతుండటాన్ని పురందేశ్వరి గమనిస్తున్నారని తెలిపారు. వీటిని సహించలేకే లోకేశ్ ను అమిత్ షా వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. జగన్ కనుసన్నల్లో జరుగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను అమిత్ షాకు వివరించారని తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you