తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య హైదరాబాద్లోని బస్భవన్లో టీఎస్ఆర్టీసీకి మూడో చైర్మన్గా ముత్తిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఎండీ వీసీ సజ్జనార్, ఈడీలు, ఆర్టీసీ అధికారులు అభినందనలు తెలిపారు.
అనంతరం ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో, అనుభవజ్ఞులైన ఎండీ సజ్జనార్ నేతృత్వంలో సంస్థ ఉద్యోగుల్లో తానొక్కడిగా సమష్టిగా పనిచేసి సంస్థను లాభాల బాటలో నడిపిస్తానని తెలిపారు. ఆర్టీసీ చైర్మన్గా తనను నియమించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) డాక్టర్ వీ రవీందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ సింగ్జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్కుమార్తోపాటు చైర్మన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.