Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

టీచర్‌పై కాల్పులు..

Must read

తెలంగాణ వీణ , జాతీయం : కోచింగ్‌ సెంటర్‌ టీచర్‌పై అకారణంగా కోపం పెంచుకున్న ఇద్దరు విద్యార్థులు తుపాకీతో ఆయనపై కాల్పులు జరిపారు. మరోసారి మరిన్ని బుల్లెట్లు దించుతామని సోషల్‌ మీడియాలో హెచ్చరించారు. ఆగ్రాలోని ఖండోలిలో చోటుచేసుకుంది. సుమిత్‌ సింగ్‌ గతంలో ఓ కోచింగ్‌ సెంటర్‌లో పనిచేశారు. ఆయన వద్ద చదువుకున్న 16, 18 ఏళ్ల ఇద్దరు విద్యార్థులు ఓ బాలికతో మాట్లాడుతుండగా సుమిత్‌ సోదరుడు తరుణ్‌ అడ్డుకున్నార

దీనిపై వారు కోపం పెంచుకుని గురువారం సుమిత్‌కు ఫోన్‌ చేసి, కోచింగ్‌ సెంటర్‌కు రావాలని కోరారు. రాగానే తెచ్చుకున్న తుపాకీతో సుమిత్‌ కాలిపై కాల్చారు. అనంతరం సోషల్‌ మీడియాలో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. అందులో ‘గ్యాంగ్‌ ఆఫ్‌ వాసేపూర్‌’ సినిమాలోని నటుల్లా పోజులు పెట్టి, ప్రస్తుతానికి ఒక్క బుల్లెట్టే కాల్చామని, ఆరు నెల్ల తర్వాత మిగతా 39 బుల్లెట్లనూ సుమిత్‌ శరీరంలోకి దించుతామంటూ హెచ్చరికలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you