Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

క్రికెట్ లైవ్ లోకి మాస్ మహారాజ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎంట్రీ..

Must read

తెలంగాణ వీణ, సినిమా : మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. 70వ దశకంలో పలు రాష్ట్రాల పోలీసులను గడగడలాడించిన స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. అక్టోబరు 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, చిత్రబృందం ప్రమోషన్ ఈవెంట్లకు సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం భారత్ లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ జరగనుండగా, ఇలాఖా మనదే తడాఖా మనదే అంటూ క్రికెట్ లైవ్ లోకి ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎంట్రీ ఇవ్వనున్నాడు. తమ చానల్లో ప్రసారమయ్యే క్రికెట్ లైవ్ లో రవితేజ పాల్గొంటున్నాడని స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్ వెల్లడించింది. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేసింది.ఈ కార్యక్రమం అక్టోబరు 8న 12.30 గంటలకు ఉంటుందని స్టార్ స్పోర్ట్స్ చానల్ వెల్లడించడంతో, అది భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఉంటుందని తెలుస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you