Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

భారత్‌లో అఫ్గాన్‌ ఎంబసీ మూసివేత

Must read

తెలంగాణ వీణ , జాతీయం : భారత్‌లో రాయబార కార్యాలయాన్ని అఫ్గానిస్థాన్‌ మూసివేసింది. ఆదివారం నుంచి కార్యకలాపాలన్నీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అఫ్గానిస్తాన్‌లో అష్రాఫ్‌ ఘనీ ప్రభుత్వాన్ని కూల్చివేసి తాలిబన్లు అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత భారత్‌లో దౌత్యపరమైన కార్యకలాపాలన్నీ నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీలోని అఫ్గాన్‌ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల  చేసింది. వనరుల కొరత, సిబ్బంది కొరతతో దౌత్య కార్యాలయాన్ని నిర్వహించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. పనిలో పనిగా భారత్‌పై కూడా ఆరోపణలు గుప్పించింది. భారత ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకపోవడం కూడా రాయ బార కార్యాలయాన్ని మూసివేయడానికి కారణమని ఆ ప్రకటనలో పేర్కొంది.  భారత్‌ సహా ఎన్నో దేశాలు అఫ్గాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వాన్ని ఇంకా గుర్తించడం లేదని వాపోయింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you