Thursday, September 19, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

రామేశ్వరంలో 3 చోట్ల వెనక్కి వెళ్లిన సముద్రం

Must read

తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : రామనాధపురం జిల్లా రామేశ్వరం లో బుధవారం ఉదయం మూడు చోట్ల సముద్రం వెనక్కి మళ్లడంతో స్థానికులు, పర్యాటకులు భయాందోళనలకు గురయ్యారు. రామనాథస్వామివారి ఆలయాన్ని దర్శించేందుకు వెళ్ళిన భక్తులు బుధవారం ఉదయం అక్కడి అగ్నితీర్థం సముద్రతీరానికి వెళ్ళినప్పుడు ఉన్నట్టుండి సముద్రం 300 మీటర్ల దూరానికి వెనక్కి మళ్ళింది. దీంతో తీరం పొడవునా భక్తులు విడిచిపెట్టిన వ్యర్థాలు, బండరాళ్లు బయల్పడ్డాయి. సుమారు అరగంట తర్వాత సముద్రం యథాతథ స్థితికి చేరింది. ఇదే విధంగా ఓలైక్కుడా, శంఖుమాల్‌ తీర ప్రాంతాల్లోనూ ఉన్నట్టుండి సముద్రం వెనక్కి మళ్లింది. దీంతో ఆ తీరంలో లంగరేసి ఉంచిన నాటుపడవలు, మరపడవలో ఇసుక మేటలలో కూరుకుపోయాయి. సుమారు పావుగంట తర్వాత ఈ రెండు ప్రాంతాల్లోనూ సముద్రం మామూలు స్థితికి చేరింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you