తెలంగాణవీణ, అల్వాల్ ; అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ లోని రాజీవ్ గృహతార, శ్యామాల లక్ష్మినగర్ కాలనీలోని నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాలనీ ప్రతినిధులు మంగళవారం కార్పొరేటర్ జితేంద్రానాథ్ ను కలిసి వినతి పతాన్ని అందజేశారు. ముఖ్యంగా గృహకల్ప కాలనీలో నీటి పైప్లైన్, శ్యామలా లక్ష్మీనగర్లోని డ్రైనేజీ లైన్లు, సిసి రోడ్డు సమస్యలను పరిష్కారించాలని కోరారు. ఇందుకు స్పందించిన కార్పొరేటర్ త్వరలోనే ఇక్కడి సమస్య పరిష్కారానిక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక కార్యకర్త తుడిమెళ్ళ మల్లికార్జున్, శ్రీశైలం యాదవ్ , నరేందర్ రెడ్డి , అల్లి మల్లేష్ , ఆసిఫుల్లా ఖాన్, గంగాధర్ , ఆమిర్ ఖాన్ , కవిత , అనసూయ లు పాల్గొన్నారు.
