తెలంగాణ వీణ/ నాచారం: తార్నాక స్కూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగ్ రావు ఆధ్వర్యంలో షేక్ అమీర్ పాషా పర్యవేక్షణలో నాచారం పోలీస్ స్టేషన్ సిఐ రుద్విర్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్న పోలీసులు సహకరించాలని దానితోపాటు ప్రజలు వాహనాల ఇబ్బందులతో వస్తే తమ దృష్టి కి తీసుకువస్తే వాహనాలు రిపేర్లకు గురైతే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే మరమ్మత్తులు చేస్తామని అసోసియేషన్ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్ అమీర్ పాషా తదితరులు పాల్గొన్నారు
