Thursday, September 19, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 ఒకే ట్రిప్‌లో అయోధ్య, వారణాసి దర్శనం.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే..

Must read

తెలంగాణవీణ జాతీయం :పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకొనే యాత్రికులకు, ప్రకృతి అందాలు చుట్టిరావాలనుకొనే ప్రయాణికుల కోసం ఇండియన్‌ రైల్వే అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) అనేక టూరిజం ప్యాకేజీలను తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా అయోధ్య, వారణాసి పుణ్యక్షేత్రాల దర్శనం కోసం గంగా సరయూ దర్శన్‌ పేరిట కొత్త టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. కాజీపేట, మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్‌, సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ రైల్వేస్టేషన్లలో టూరిస్టులు రైలు ఎక్కొచ్చు. యాత్ర ముగించుకున్నాక సికింద్రాబాద్‌లో దిగాల్సి ఉంటుంది. ఈ ట్రిప్‌ మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు కొనసాగుతుంది. ప్రతి ఆదివారం ఈ ట్రైన్‌ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్‌ 22 నుంచి వివిధ తేదీల్లో ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రయాణం కొనసాగుతుందిలా..
మెదటి రోజు ఉదయం 9:25 గంటలకు సికింద్రాబాద్‌ (దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ నం: 12791) నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఆ రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
రెండో రోజు వారణాసి చేరుకుంటారు. ముందుగా బుక్‌ చేసిన హోటల్‌కు చేరుకుంటారు. ఆ సాయంత్రం కాశీ విశ్వనాథుని పుణ్యక్షేత్రం, గంగ హారతి చూస్తారు. ఆ రాత్రి అక్కడే బస ఉంటుంది.
మూడో రోజు ఉదయం అల్పాహారం తీసుకున్నాక వారణాసిలో ప్రసిద్ధ ఆలయాలను (కాశీ విశ్వనాథ ఆలయం, కాలభైరవ్‌ మందిర్‌ ) సందర్శించుకోవచ్చు. సాయంత్రం షాపింగ్‌ ఉంటుంది. రాత్రి బస అక్కడే.
నాలుగో రోజు టిఫిన్‌ తిన్నాక అయోధ్య చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో కాసేపు సేదతీరాక అయోధ్య ఆలయం, హనుమంతుని దర్శనం, దశరథ్‌ మహల్‌ను చుట్టివస్తారు. ఇక సాయంత్రం సరయు ఘాట్‌ చూసేందుకు వెళ్తారు. రాత్రి ప్రయాగ్‌రాజ్‌లో బస చేయాల్సి ఉంటుంది.
ఐదో రోజు ఉదయం అల్పాహారం స్వీకరించాక సాయంత్రం సికింద్రాబాద్‌ (ట్రైన్‌ నం: 12792)కు బయల్దేరుతారు.
ఆరో రోజు రాత్రి 9:30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.
ఛార్జీలు ఇలా..
కంఫర్ట్‌లో (థర్డ్‌ ఏసీ బెర్త్‌) ఒక్కో ప్రయాణికుడికి రూమ్‌ సింగిల్ షేరింగ్‌లో అయితే రూ.41,090, ట్విన్ షేరింగ్‌కు రూ.24,350, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.19,720 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌కు రూ.15,390, విత్ అవుట్ బెడ్ అయితే రూ.13,790గా నిర్ణయించారు.
స్టాండర్డ్‌లో (స్లీపర్‌ బెర్త్‌) రూమ్‌ సింగిల్ షేరింగ్ అయితే రూ.21,620, ట్విన్ షేరింగ్‌కు రూ.17,220, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.16,710. ఇక 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.13,620, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.12,010 చెల్లించాలి.
ఇవి గుర్తుంచుకోండి.
ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైల్లో 3 ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణం.
ప్యాకేజీని బట్టి స్థానికంగా ప్రయాణానికి ఏసీ గదులు, వాహనం ఏర్పాటు చేస్తారు.
మూడు రోజులు ఉదయం టిఫిన్‌, రాత్రి భోజనం ఉంటుంది.
ప్రయాణ బీమా ఉంటుంది.
పర్యటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే సందర్శకులే చెల్లించాలి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you