Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

మదనపల్లె అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సీరియస్‌ డీజీపీకి ఆదేశాలు జారీ :

Must read

తెలంగాణవీణ ఏపీ బ్యూరో : మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు. వెంటనే ఘటనాస్థలికి హెలికాప్టర్‌లో వెళ్లాలని డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఆదేశాలు జారీ చేశారు. కాసేపట్లో డీజీపీ, సీఐడీ చీఫ్‌ మదనపల్లెకు వెళ్లనున్నారు. అగ్నిప్రమాదంలో కీలక దస్త్రాలు కాలిపోయినట్లు సమాచారం. నూతన సబ్‌కలెక్టర్‌ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదమా? కుట్రపూరితమా? అనే అంశంపై విచారణకు సీఎం ఆదేశించారు. ఈ ఘటనలో ఉద్దేశపూర్వకంగానే భూముల దస్త్రాలు తగులబెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులతో సీఎం సమీక్షమదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షకు సీఎస్‌ నీరభ్ కుమార్‌ ప్రసాద్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మహేశ్‌ చంద్ర లడ్హా హాజరయ్యారు. అగ్నిప్రమాదంలో అసైన్డ్‌ భూముల దస్త్రాలు దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్‌ సహా సమస్త వివరాలు బయటకు తీయాలని చంద్రబాబు ఆదేశించారు.అన్నమయ్య జిల్లా కలెక్టర్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. రాత్రి 11.24 గంటలకు ప్రమాదం జరిగినట్లు ఆయనకు జిల్లా అధికారులు వివరించారు. ఘటనపై జిల్లా అధికారుల సత్వర స్పందన లేకపోవడంపై సీఎం ఆరా తీశారు. ఆదివారం రాత్రి 10.30 వరకు కార్యాలయంలో గౌతమ్‌ అనే ఉద్యోగి ఉన్నట్లు గుర్తించారు. ఆదివారం ఆ సమయం వరకు ఉద్యోగి ఉండటానికి కారణాలు తెలుసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఉద్యోగి ఎందుకు వెళ్లాడు?, ఏ పని కోసం వెళ్లాడని వివరాలు అడిగారు. ఘటన సమయంలో విధుల్లో వీఆర్‌ఏ ఉన్నాడని అధికారులు వివరించారు. ఘటనాస్థలికి పోలీసు జాగిలాలు వెళ్లాయా, ఏం విచారణ చేశారని చంద్రబాబు అడిగారు. ఫోరెన్సిక్‌, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యంపై ప్రశ్నించారు. ఘటన సమయంలో విద్యుత్‌ సరఫరా పరిస్థితిపైనా విచారణ జరపాలన్నారు. సీసీ కెమెరా దృశ్యాలు వెంటనే స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అక్కడ సంచరించిన వ్యక్తుల వివరాలు సేకరించాలని ఆదేశించారు. నేరాలు చేసి సాక్ష్యాల చెరిపేతలో ఆరితేరినోళ్లు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారని చెప్పారు. గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలను అధికారులు మరిచిపోకూడదన్నారు. సాక్ష్యాల చెరిపివేత కోణంలో లోతుగా దర్యాప్తు జరపాలని సీఎం ఆదేశించారు. ఘటనపై సమగ్ర వివరాలు తన ముందుంచాలన్నారు.అర్ధరాత్రి వరకు ఉద్యోగి ఉండటంపై అనుమానాలు ఆదివారం అర్ధరాత్రి మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో విలువైన రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు, సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. కార్యాలయం సిబ్బంది విషయం తెలుసుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక కేంద్రం పక్కనే ఉండటంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే ఈ మంటల్లో విలువైన రెవెన్యూ రికార్డలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే కార్యాలయంలో పనిచేసే గౌతమ్‌ అనే ఉద్యోగి కార్యాలయంలో రాత్రి 12 గంటల వరకు ఉన్నట్లు సమాచారం. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌, జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు, ఏఎస్పీ రాజ్‌కుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you