Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 11 నుంచి కాంగ్రెస్ ధన్యవాద్ యాత్ర

Must read

  • యూపీలో బీజేపీకి మించి సీట్లు గెలుచుకున్న ఇండియా కూటమి
  • తమను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయం
  • మొత్తం 403 నియోజకవర్గాల్లోనూ యాత్ర

తెలంగాణ వీణ ..భారతదేశం:లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ.. తమను అక్కున చేర్చుకున్న యూపీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి 15 వరకు రాష్ట్రంలోని 403 నియోజకవర్గాల్లో ‘ధన్యవాద్ యాత్ర’ చేపట్టాలని నిర్ణయించింది. సీనియర్ నేతలు, కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొంటారని సమావేశం. ఈ యాత్ర సందర్భంగా వివిధ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు రాజ్యాంగ పుస్తకాన్ని బహూకరించి గౌరవిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 గెలుచుకోగా, మిత్రపక్ష సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you