Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మూడు క్యాంపులపై మావోయిస్టుల కాల్పులు..

Must read

తెలంగాణ వీణ, ములుగు: తెలంగాణ -ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని మూడు బేస్‌ క్యాంపులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఏకధాటిగా కాల్పులకు తెగబడ్డారు. చింతవాగులోని సీఆర్పీఎఫ్‌ 151 బెటాలియన్‌, పామేడులోని 204 కోబ్రా బెటాలియన్‌, ధర్మారంలోని 151 బెటాలియన్‌ క్యాంపులపై గ్రనేడ్లు, రాకెట్‌లాంచర్లతో దాడి చేశారు. ఈ దాడులను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. దీనిపై సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ఆరా తీస్తున్నారు..

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you