Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

విమానం టాయిలెట్ లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు.. జర్నీ మొత్తం అందులోనే..!

Must read

తెలంగాణవీణ,జాతీయం: బెంగళూరు వెళ్లేందుకు విమానం ఎక్కిన ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. తొందరగా, సౌకర్యవంతంగా వెళ్లొచ్చని విమానం ఎక్కితే.. గంటన్నరకు పైగా టాయిలెట్ లోనే ఉండాల్సి వచ్చింది. టాయిలెట్ డోర్ లాక్ తెరుచుకోకపోవడంతో ఆయన తన గమ్యం చేరేదాకా అందులోనే చిక్కుకుపోయారు. మంగళవారం ముంబై నుంచి బెంగళూరు బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో చోటుచేసుకుందీ ఘటన. బాధితుడు, ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు స్పైస్ జెట్ విమానం ఎస్ జి- 268 బెంగళూరు బయలుదేరింది. టేకాఫ్ అయిన తర్వాత ఓ ప్రయాణికుడు టాయిలెట్ కు వెళాడు. అయితే, మాల్ ఫంక్షన్ కారణంగా డోర్ తెరుచుకోకపోవడంతో లోపలే చిక్కుకు పోయాడు. డోర్ తెరిచేందుకు బయట నుంచి ఫ్లైట్ సిబ్బంది చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి. దీంతో ఎయిర్ హోస్టెస్ ఓ కాగితంపై నోట్ రాసి డోర్ కింది నుంచి లోపలికి పంపింది. డోర్ బయటి నుంచి కూడా తెరుచుకోవడంలేదని, విమానం ల్యాండయ్యాక ఇంజనీర్లు వచ్చి డోర్ తెరుస్తారని పేర్కొంది. కాసేపట్లో బెంగళూరులో ల్యాండ్ కాబోతున్నాం.. టాయిలెట్ సీటుపై జాగ్రత్తగా కూర్చొని దెబ్బలు తగలకుండా చూసుకోండని చెప్పింది. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండయ్యాక ఇంజనీర్లు వచ్చి డోర్ పగలగొట్టి ప్రయాణికుడిని బయటకు తీశారు. తీవ్ర ఆందోళనకు గురైన ఆ ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you