తెలంగాణ వీణ , సినిమా : కన్నడ మూవీ కిరిక్ పార్టీ తో సరిగ్గా ఇదే రోజున 2016న ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న.మొదటి సినిమాతోనే కన్నడ సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకున్న ఈ అమ్మడు తెలుగు లో ఛలో సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా విజయం సాధించడంతో పాటు, తదుపరి సినిమా గీత గోవిందం కూడా సూపర్ హిట్ అయింది. కన్నడ మూవీతో ఎంట్రీ ఇచ్చినా కూడా టాలీవుడ్ లో వరుసగా రెండు సినిమాలు హిట్ అవ్వడంతో ఒక్కసారిగా సౌత్ స్టార్ హీరోయిన్ గా ఈ అమ్మడు నిలిచింది. తెలుగులో అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ గా నిలవడంతో పాటు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. మరి ఆ పాప సంగతేంటి? తాజాగా పుష్ప మరియు యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిలిచింది అనడంలో సందేహం లేదు.కిరిక్ పార్టీ సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో మరింత జోష్ తో సినిమాల్లో నటిస్తోంది. ఈ అమ్మడు మరో ఏడు వసంతాల పాటు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ ఆమె ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్న రష్మిక మరో వైపు హిందీలో కూడా కొన్ని సినిమాలకు కమిట్ అయింది.