Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

పీఓకేలోని శారదా దేవాలయాన్ని పాక్ సైన్యం ఆక్రమించింది

Must read

తెలంగాణ వీణ , జాతీయం : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రముఖ శారద దేవాలయం పరిసరాలను ఆక్రమించిన పాక్ సైన్యం అక్కడ కాఫీ హోంను నిర్మిస్తోందని సేవ్ శారద కమిటీ (ఎస్ఎస్‌సీ) వ్యవస్థాపకుడు రవింద్ర పండిత వెల్లడించారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటూ బెంగళూరులో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ స్థలానికి సంబంధించి కోర్టు గతంలో అనుకూల తీర్పు కూడా వెలువరించిందన్న ఆయన.. పాక్ సైన్యం ఆక్రమణలకు దిగుతోందని చెప్పారు.‘‘పాక్ సైన్యం అక్కడి స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతోంది. ఆలయ గోడలను ధ్వంసం చేస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ మేం పోరాడతాం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you