Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

గచ్చిబౌలి స్టేడియంలో 3,783 మంది కళాకారుల ప్రదర్శన….

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలుగు వారి ప్రాచీన నృత్యం కూచిపూడి డ్యాన్స్ లెసన్ గిన్నిస్ వరల్డ్ రికార్డు లో ఎక్కింది ఏకకాలంలో 3,783 మంది కళా కారులు కూచిపూడి నృత్యంచేసి కళా వైభవాన్ని ప్రపంచానికి చాటారు. గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి కళావైభవం పేరిట లార్జెస్ట్ కూచిపూడి డ్యాన్స్ లెసన్ ప్రదర్శించారు. స్టేడియం నలుమూలలా ఏడు నిమిషాలపాటు కళాకారులు నృత్యంచేస్తూ అలరించారు గురువు పసుమర్తి శేషుబాబు ఆధ్వర్యంలో కళాకారులు ఏకకాలంలో నృత్యం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అడ్డుడికేటర్ రిషినాథ్ నిర్వాహకులకు సర్టిఫికెట్ను అందజేశారు. 2020 లో త్యాగరాయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెన్నైలో ఏక కాలంలో 1,183 మంది కళాకారులు కూచిపూడి డ్యాన్స్ లెసన్ ప్రదర్శించారని రిషినాథ్ తెలిపారు. కళలను ప్రోత్సహించి ప్రేరణ కల్గించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలోనే కళలను ప్రోత్సహించే సంఘాలుండాలని ఆయన అభిప్రాయపడ్డారు రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ కూచిపూడి నృత్యం తెలుగువారికి ఎంతో ఇష్టమైన దని, ఈ నృత్యరూపకం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కి ఎక్కడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు లలిత వ్యవస్థాపక అధ్యక్షుడు రమణారావు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you