Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

మహిళలకు ఫ్రీ జర్నీ స్కీమ్‌ ఎత్తేయాలి.. బస్‌ భవన్‌ ముట్టడికి ఆటో కార్మికుల యత్నం

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : బస్సు భవన్ ముట్టడికి మంగళవారం ఉదయం భారతీయ మజ్దూర్‌ సింఘ్‌(బీఎంఎస్‌) ఆటో కార్మికులు యత్నించారు. పలు డిమాండ్ల సాధనతో నిరసన ప్రదర్శన చేపట్టారు వాళ్లు. ఈ క్రమంలో బస్‌భవన్ వైపు దూసుకెళ్లే యత్నం చేయగా.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ.   రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో.. తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తీసుకొచ్చింది. ఈ క్రమంలో పథకానికి వ్యతిరేకంగా పలు జిల్లాల్లోనూ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ జర్నీ స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయాలని, అలాగే తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you