Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

భూకబ్జా కేసుపై మాజీ మంత్రి మల్లారెడ్డి వివరణ

Must read

తెలంగాణ వీణ , మేడ్చల్ : మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో తనపై కేసు నమోదైన విషయం వాస్తవమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. దీనిని ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా చూడట్లేదని అన్నారు. భూకబ్జాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు. శామీర్ పేట్ మండలంలోని కేశవాపురం గ్రామంలో 47 ఎకరాల భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని గ్రామస్థులు ఆరోపించారు. ఎన్నికల సమయంలో రాత్రికిరాత్రే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మండిపడ్డారు. తన అనుచరులతో కలిసి మల్లారెడ్డి ఈ దందా చేశారని కేశవాపురం గ్రామస్థులు చెప్పారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you