తెలంగాణ వీణ , జాతీయం : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామమందిరంలో రాముని ప్రాణప్రతిష్ఠ వచ్చే ఏడాది జనవరి 22న నిర్వహించాలని నిర్ణయించినట్టు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. రామమందిర నిర్మాణ పనులపై సమీక్షించిన తర్వాత గతంలోనే నిర్ణయించిన జనవరి 22వ తేదీనే ప్రాణప్రతిష్ఠ జరపాలని నిశ్చయించామన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.
దేవాలయంలో రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించే గర్భగుడికి సంబంధించిన చిత్రాలను శనివారమే విడుదల చేశామని అన్నారు. గర్భగుడి నిర్మాణం, లైటింగ్ ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పారు. వేద పండితుడు వారణాసి లక్ష్మీకాంత్ నేతృత్వంలో ప్రాణప్రతిష్ఠ వైదిక ఆచార క్రియలు జనవరి 16న ప్రారంభమవుతాయని తెలిపారు.