తెలంగాణ వీణ: బాచుపల్లి : అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాచుపల్లి కౌసల్య కాలనీలో 11 వ యోగ దినోత్సవం 2025 ని భారతీయ జనతా పార్టీ బాచుపల్లి శాఖ నిర్వహించింది.యోగ గురువు నరసింహ హాజరై యోగ ప్రాముఖ్యతని తెలుపుతూ యోగ సాధన చేయించారు.ముఖ్య అతిథిగా హాజరైన భాజపా రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి గారు మాట్లాడుతూ విశ్వగురు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చొరవతో ఐక్య రాజ్య సమితి 2014 లో జూన్ 21 ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం, దానికి 175 పైగా ప్రపంచ దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా గొప్ప విషయమన్నారు.యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత,శారీరక ఆరోగ్యం పొందుతామని మానవాళికి యోగ ఒక ఆరోగ్య ప్రదాయని అని అందరము దైనందిన జీవితంలో యోగ ని సాధన గా ఆచరించడం ఎంతో ముఖ్యమన్నారు.ఈ సందర్భంగా బాచుపల్లి శాఖ అధ్యక్షులు ప్రసాద్ రాజు మాట్లాడుతూ కార్యక్రమనికి సహకరించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ,కౌసల్య కాలనీ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసాని నరసింహ ,విజయలక్ష్మి, రేపన్ కాసి, గజ్జల సంతోష్, నారాయణమూర్తి, గోపతి సురేష్, శివప్రసాద్, సుమన్ రావు, విజయ్, ఉదయ్, సునీల్ రెడ్డి, భార్గవి రెడ్డి, హరిత, కృష్ణారెడ్డి, కార్తీక్, ప్రహ్లాద్, ప్రవీణ్, చరణ్, అవినాష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

