తెలంగాణవీణ, హైదరాబాద్ ; బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్న, కలలుగన్న కెరియర్స్ సౌధాన్ని పటిష్టంగా నిర్మించుకోవాలన్న స్వీయ క్రమశిక్షణ ఎంతో అవసరమని శిల్ప హోమ్స్ చైర్మన్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొండాపూర్ లోని ఏ జోన్ బ్యాట్మింటన్ అకాడమీలో నిర్వహించిన వికారాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. ఈ టోర్నమెంట్ బి ఏ వి డి జిల్లా అధ్యక్షుడు కొసరాజు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి యు వి ఎన్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ మేరకు వివిధ విభాగాల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పి. శ్రీనివాస్ రెడ్డి తో పాటు బ్యాట్ కోశాధికారి వంశీధర్, ఆర్ ఆర్ డి బి ఏ ఆనంద్, బి ఏ వి డి జాయింట్ సెక్రెటరీ సుభాష్ రెడ్డి, బి ఏ వీ డి కోశాధికారి పివిఎల్. కుమార్, బీఏవీడి మెంబర్ ఏ. వి రమణారెడ్డి, మ్యాచ్ పాయింట్ బ్యాట్మెంటన్ అకాడమీ నిర్వాహకులు వేణు చౌదరి, ఇంటర్నేషనల్ క్రీడాకారిని మనీషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యూవియన్ బాబు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన వికారాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి టోర్నమెంట్ కు 265 మంది క్రీడాకారులు పాల్గొనడం సంతోషకరంగా ఉందని, జిల్లా వ్యాప్తంగా మరెన్నో టోర్నమెంట్లు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తించి వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. టోర్నమెంట్ కు సహకరించిన ఏజోన్ బ్యాట్మింటన్ అకాడమి మేనేజ్మెంట్ మరియు వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
క్రీడాకారులకు స్వీయ క్రమశిక్షణ ఎంతో అవసరం – శిల్ప హోమ్స్ చైర్మన్ పి. శ్రీనివాస్ రెడ్డి
