తెలంగాణ వీణ, నిజాంపేట్: నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో బహుళ అంతస్తుల నిర్మాణం వలన పట్టణీకరణ జరిగి ట్రాఫిక్ సమస్య తీవ్రతరమైనదనీ, పలుమార్లు మున్సిపల్ కమిషనర్ కు నివేదించినప్పటికీ ఎటువంటి మార్పు లేకపోవడంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేసినట్లు స్థానిక అధ్యక్షులు నరేంద్ర చౌదరి తెలిపారు.. ముఖ్యంగా అలీప్ సర్కిల్, INCOIS సర్కిల్, అదేవిధంగా మూడు కోతుల జంక్షన్ వద్ద స్కూల్ బస్సులు, ఉద్యోగుల పికప్ బస్సులు, అలీఫ్ ఇండస్ట్రియల్ ఏరియా కి సంబంధించిన వాహనాలు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రగతి నగర్ కు వాటర్ టాంకర్స్, ప్రైవేటు వాహనాలతో అనునిత్యం రద్దీగా మారినా సిగ్నల్స్ ఏర్పాటు లేకపోవడంపై నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేశారు. వెంటనే స్పందించిన మియాపూర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ప్రశాంత్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ను జంక్షన్ల వద్ద ఉండేలా చూస్తాను అని అదేవిధంగా పై అధికారులకు వివరించి సిగ్నల్స్ ఏర్పాటుకు చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలోప్రగతినగర్ అధ్యక్షుడు నరేంద్ర చౌదరి,జిల్లా నాయకులు డాక్టర్ రాజు,సుమన్ రావు,చక్రధర్,జక్కుల రవి యాదవ్,కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శులు మదన్మోహన్,కిషోర్, సీనియర్ నాయకులు మందపాటి శ్రీధర్ రెడ్డి ఉపాధ్యక్షులు సత్యనారాయణ,శివకుమార్ గుప్తా, నల్లమోతు నరేష్, కార్యదర్శులు వింజం రామకృష్ణ,శ్రీమతి లక్ష్మి,కోశాధికారి రవి కార్పొరేషన్ నాయకులు అని రుద్ర, వేణుమాధవ్,రాహుల్, తరుణ్, పట్నాయక్,నాగళ్ళ శేషగిరి , మల్లికార్జున్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ప్రగతినగర్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు కొరకు బిజెపి ఆధ్వర్యంలో నిరసన:బిజెపి అధ్యక్షుడు నరేంద్ర చౌదరి
