చారిత్రక మైలురాయి .. 80 కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం…
త్వరలో మరో 400 మీటర్లకు అనుమతి !
కాలనీవాసుల హర్షం…
తెలంగాణవీణ, అల్వాల్ : మల్కాజిగిరి నియోజకర్గంలోని కౌకూర్ వాంబే కాలనీలో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న విద్యుత్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. 80 కుటుంబాలకు పైగా విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించబడటంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ చారిత్రక మైలురాయిని చేరుకోవడంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ చొరవ, స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ సహకారంతో పాటు స్థానిక సామాజిక కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుడిమెళ్ల మల్లికార్జున్ అవిశ్రాంత పోరాటం కీలక పాత్ర పోషించాయని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక సమస్యలతో సతమతమైన వాంబే కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మల్లికార్జున్ నిరంతరం కృషి చేస్తూ, స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళడంతో ఆయన పట్టుదల, నిస్వార్థ సేవ ఫలితంగానే ఈరోజు 80 కుటుంబాలకు విద్యుత్ సరఫరా తిరిగి ప్రారంభమైందని కాలనీవాసులు చెబుతున్నారు. ఇది కాలనీవాసుల దశాబ్దాల కలను నిజం చేసిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మైనంపల్లి హనుమంత్ రావు. రాజ్ జితేంద్రనాథ్, తుడిమెళ్ల మల్లికార్జున్ లకు కృతజ్ఞతలు తెలిపారు. వాంబే కాలనీలో ఇకపై మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని కాలనీవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఆదివారం వాంబే కాలనీలోని 80కి పైగా కుటుంబాలు విద్యుత్ కనెక్షన్లు తిరిగి పొందడం వారి జీవితంలో మరపురాని ఆనందాన్ని పొందారు. అంతెకాకుండా త్వరలోనే మరో 400కి పైగా విద్యుత్ మీటర్లను అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో పాటు, కాలనీ నివాసితులకు అధికారిక చట్టబద్ధమైన స్థలాల కేటాయింపులు కూడా జరగనుంది . మైనంపల్లి అంకితభావానికి కృతజ్ఞతాపూర్వకంగా కాలనీ నివాసితులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సామాజిక కార్యకర్త తుడిమెళ్ల మల్లికార్జున్, వేణు గౌడ్ , చందు, శివ, సిద్దయ్య, నాగేశ్వరరావుతో పాటు ప్రముఖులు హాజరై కాలనీ ప్రతినిధులతో కలిసి నిలిచారు. ఇక్కడి కాలనీల్లోని సమస్య పరిష్కారంలో మైనంపల్లి హన్మంతరావు ప్రత్యేకచోరవ తీసుకోవటంతో కాలనీవాసులు దన్యవాదాలు తెలిపారు.
