తెలంగాణ వీణ/యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా,ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని వైఎన్ఎస్ ఫంక్షన్ హాల్లో మథర్ ఎడ్యుకేషన్, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ బొజ్జ సంధ్య రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆలేరు,భువనగిరి, జనగామ నియోజకవర్గాల పరిధిలోని కుట్టుమిషన్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మహిళ సాధికారత సాధించినప్పుడే సమాజంలో నిజమైన అభివృద్ధి జరుగుతందన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే,వాళ్ళ పిల్లలని గొప్పగా చదివించి,కుటుంబానికి ఆసరా గా ఉంటరాన్నారు.అందుకే మన ప్రజాప్రభుత్వం మహిళలకు పథకాలల్లో పెద్దవిఠవేసిందన్నారు.గృహలక్ష్మి, మహలక్ష్మి వంటి పథకాల ద్వారా మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.బొజ్జ సంధ్య రెడ్డి గారు తన బాధ్యతతో, ఎంతో మంది కుటుంబాలకు ఇలాంటి శిక్షణ కార్యవమాల ద్వారా వెలుగులు నింపుతుందన్నారు.శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఇంత మంది మహాలక్ష్మిలను కలవటం చాలా సంతోషంగా ఉందన్నారు,అలాగే ప్రతి ఆడబిడ్డకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.