Thursday, September 19, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 2027 నాటికి భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్‌ గీతా గోపీనాథ్‌:

Must read

తెలంగాణవీణ జాతీయం :భారత్‌ ఆర్థికంగా అంచనాలకు మించి అభివృద్ధి చెందుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఫస్ట్‌ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్‌అభిప్రాయపడ్డారు. ఆమె తాజాగా ఆంగ్లపత్రిక ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ వృద్ధి వేగానికి వేర్వేరు కారణాలున్నాయన్నారు. 2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆమె అంచనా వేశారు.
‘‘గత ఆర్థిక సంవత్సరంలో అంచనాల కంటే మెరుగైన వృద్ధి రేటును భారత్‌ నమోదు చేసింది. దానిని కొనసాగించేందుకు తీసుకొనే చర్యలు ఈ ఏడాది మా అంచనాలను ప్రభావితం చేస్తాయి. దీంతోపాటు దేశంలో ప్రైవేటు వ్యయాలు కూడా బాగా పుంజుకొన్నట్లు మేం గమనించాం’’ అని గీతా వెల్లడించారు. ‘‘గతేడాది ప్రైవేటు వ్యయాల వృద్ధి 4 శాతం మాత్రమే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాలు కోలుకొని పెరిగేకొద్దీ ఇది కూడా వృద్ధి చెందుతుంది. ద్విచక్ర వాహనాల విక్రయాలు, ఎఫ్‌ఎంసీజీ విక్రయాలు బాగా పుంజుకొన్నాయి. దీనికి వర్షాలు కూడా తోడవటంతో మంచి పంట ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఫలితంగా వ్యవసాయ ఆదాయం పెరిగి గ్రామీణ వినిమయం పుంజుకొంటుంది. మా అంచనాలకు మూలాలు ఇవే’’ అని ఐఎంఎఫ్ డిప్యూటీ డైరెక్టర్‌ వెల్లడించారు. భారత్‌లో ఎఫ్ఎం‌సీజీ, ద్విచక్ర వాహన విక్రయాలు, అనుకూలమైన వర్షాల డేటా ఆధారంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఐఎంఎఫ్‌ భారత వృద్ధిరేటు అంచనాలను 7శాతానికి పెంచింది. ఈ ఏడాది ఆర్థిక సర్వేలో ప్రభుత్వం ఇచ్చిన 6.5 శాతం కంటే ఇది అధికం కావడం గమనార్హం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you