Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

పవన్ కల్యాణ్ అంటే పవనం కాదు…

Must read

  • ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికైన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం
  • ఏపీ ప్రజలు తమకు అతిపెద్ద బహుమతి ఇచ్చారని వ్యాఖ్య
  • ఏపీలో చారిత్రక విజయం సాధించినట్లు చంద్రబాబు తనతో చెప్పారన్న మోదీ
  • పవన్ మన సమక్షంలోనే ఉన్నారని కూటమి నేతలతో మోదీ వ్యాఖ్య

తెలంగాణ వీణ,హైదరాబాద్:పవన్ కల్యాణ్ అంటే పవనం కాదని… సునామీ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఎన్డీయే కూటమి సమావేశంలో ఆయన జనసేనానితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనను ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు తమకు అతిపెద్ద బహుమతి ఇచ్చారన్నారు. ఏపీలో మనం (ఎన్డీయే కూటమి) చారిత్రక విజయం సాధించామని చంద్రబాబు తనతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. పవన్ కల్యాణ్ అంటే ఓ సునామీ అని అభివర్ణించారు. అలాంటి పవన్ మన సమక్షంలోనే ఉన్నారని ఎన్డీయే కూటమి సమావేశంలో అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you