Thursday, September 19, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

వరల్డ్ కప్ లో పాక్ పై భారత్ గెలవాలంటూ హోమాలు

Must read

  • టీ20 వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తున్న అమెరికా, వెస్టిండీస్ దేశాలు
  • నేడు న్యూయార్క్ లో భారత్, పాక్ మ్యాచ్
  • దాయాదుల సమరం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

తెలంగాణ వీణ..భారతదేశం:చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు నేడు టీ20 వరల్డ్ కప్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇక, టీమిండియా గెలవాలంటూ ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో అభిమానులు హోమాలు, పూజలు నిర్వహించారు. రోహిత్ సేన విజయాన్ని కాంక్షిస్తూ… వేదమంత్రాలు చదువుతూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ సందడి చేశారు. టీ20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. భారత్ తాను ఆడిన తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై విజయం సాధించగా… పాకిస్థాన్ జట్టు పసికూన అమెరికా చేతిలో ఓటమిపాలైంది. దాంతో నేడు భారత్ తో మ్యాచ్ పాక్ కు ఎంతో కీలకం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you