తెలంగాణవీణ, హైదరాబాద్ : పలు పబ్బుల్లో డీజే గా వ్యవహరించే డి జె సిద్ధార్థ్ డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డారు. పబ్బులకు నిత్యం వెళ్లే వారిని ఎస్ఓటి ముమ్మరంగా పరీక్షలు జరిగారు. గతంలో డ్రగ్స్ తీసుకున్న వారి లిస్ట్ లో దొరికిన పేర్ల ఆధారంగా విచారణ సాగించారు. డీజే సిద్ధార్థ ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించిన ఎస్ఓటి అధికారులు,తనతో పాటు మరొక వ్యక్తికి డక్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఎస్ఓటీ వెల్లడించారు. సిద్ధార్థ ని అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీసులకు అప్పగించినట్లు ఎస్ఓటి తెలిపారు.గత కొంతకాలం నుంచి పెద్ద మొత్తంలో ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నార్కోటిక్ బ్యూరో గుర్తించారు.