Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 పోలీస్‌ క్యాంప్‌పై మావోయిస్టుల బాంబుల వర్షం

Must read

తెలంగాణ వీణ,హైదరాబాద్:ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. నారాయణ్‌పూర్‌ ​జిల్లాలోని అబూడ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో సీఆర్​పీఎఫ్​ బేస్‌ క్యాంప్‌పై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాంబులతో దాడి చేశారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి.అర్ధరాత్రి జవాన్లు నిద్రిస్తున్న సమయంలో మావోయిస్టులు ఈరక్‌ బట్టి క్యాంప్‌పై ఒక్కసారిగా బారెల్ ​గ్రెనేడ్ ​లాంచర్లతో విరుచుకుపడ్డారు. నాలుగు బీజీఎల్​లను ప్రయోగించారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుదాడికి దిగగా మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. అదనపు బలగాలతో క్యాంపు పరిసర అటవీ ప్రాంతంలో కూంబింగ్ ​నిర్వహిస్తున్నారు. దాడికి సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you