Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు ఇన్‌స్పైరింగ్ స్పీచ్..

Must read

  • ఎంపీ, పవన్ కల్యాణ్‌తో కలిసి ఎన్డీయే సమావేశానికి చంద్రబాబు
  • మోదీ పదేళ్ల పాలనపై ప్రశంస
  • మోదీలాంటి శక్తిమంతమైన నేతను తానెక్కడా చూడలేదన్న బాబు
  • ప్రధాని పదవికి మోదీ పేరును ప్రతిపాదించగానే కరతాళ ధ్వనులు
  • మోదీని బలపరిచిన నితీశ్‌కుమార్ సహా ఎన్డీయే నేతలు

తెలంగాణ వీణ,హైదరాబాద్:ఢిల్లీలోని పార్లమెంట్ సంవిధాన్ భవన్‌లో జరుగుతున్న ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు, పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. మోదీ పక్కనే చంద్రబాబు, ఆ పక్కన నితీశ్ కుమార్ కూర్చున్నారు. లోక్‌సభ పక్షనేతగా మోదీ పేరును చంద్రబాబు ప్రతిపాదించనున్నారు. సమావేశంలో బీజేపీ చీఫ్ నడ్డా మాట్లాడుతూ ఏపీలోనూ ఎన్డీయే సర్కారు కొలువుదీరబోతున్నదని చెప్పారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో మూడోసారి అధికారంలోకి వచ్చినట్టు తెలిపారు. మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ ప్రసంగించారు. గత పదేళ్లలో దేశం ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్డీయేను అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాని మోదీ గత మూడు నెలలుగా ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా గడిపారని పేర్కొన్నారు. ఏపీలో మూడు బహిరంగ సభలు, ఒక భారీ ర్యాలీ నిర్వహించినట్టు గుర్తుచేశారు. హోంమంత్రి అమిత్‌షా ఏపీలో నిర్వహించి సభతో ఎన్నికల స్వరూపమే మారిపోయిందని కొనియాడారు. భారీ మెజార్టీ రావడానికి అది కూడా కారణమంటూ ధన్యవాదాలు తెలిపారు. నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్ వంటి వారు కూడా ప్రచారానికి రావడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని భారతదేశం గత పదేళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందని కొనియాడారు. ఆయన నేతృత్వంలోనే భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుందని ప్రశంసించారు. ఇప్పుడు వికసిత్ భారత్, ప్లాన్ 2047పై ప్రణాళికలు రూపొందించారని, వీటిని చేరుకుంటామని తాము పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రపంచంలో భారత్ అగ్రరాజ్యంగా, లేదంటే రెండో స్థానానికి ఎదుగుతుందని పేర్కొన్నారు. దేశానికి సరైన సమయంలో, సరైన వ్యక్తి దొరికారని ప్రశంసించారు. తాను ఎంతోమంది నేతలను చూశాను కానీ, మోదీ లాంటి శక్తిమంతమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదన్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రధానిగా నరేంద్రమోదీ పేరును బలపరుస్తున్నట్టు చెప్పారు. ఏపీలో ప్రజలు తమకు చారిత్రక విజయం అందించిపెట్టారని తెలిపారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఎలాంటి భేషజాలు లేకుండా పనిచేసి అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు. ఆ తర్వాత జేడీయూ చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మోదీ పేరును బలపరిచారు. అనంతరం కూటమి నేతలు ఒక్కొక్కరిగా మోదీ పేరును బలపరుస్తూ తమ ఆమోదం ప్రకటించడంతో ఇతర సభ్యులు కరతాళ ధ్వనులతో హర్షాతిరేకాలు ప్రకటించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you