తెలంగాణ వీణ, జాతీయం : ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి కారును ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కారు ధ్వంసమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చాలా శ్రమించి కారులోంచి మృతదేహాలను బయటకు తీశారు. హాపూర్ జిల్లాలోని జాతీయ రహదారి 09పై అల్లాభక్ష్పూర్ టోల్ ప్లాజా సమీపంలో.. కారు అదుపు తప్పి డివైడర్ను దాటి అవతలి వైపుకు చేరుకుంది. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. కారులో ఉన్న ఆరుగురు దుర్మరణం చెందారు.