Thursday, September 19, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కు పటిష్ట భద్రతా

Must read

తెలంగాణ వీణ, ఉప్పల్: ప్రేక్షకుల సహకారం ఎంతో అవసరం, కమీషనర్ సుధీర్ బాబు ఐపిఎస్,
జనవరి 25 వ తేదీ నుండి 29 వ తేదీల మధ్య ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐదు రోజుల పాటు జరగనున్న టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపిఎస్ రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు ఏసిపిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరుగనున్న టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం గొప్ప అవకాశం అని, ఎన్ని సవాళ్ళు ఎదురైనా తగిన విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మీడియా ప్రతినిధులకు, ఇతరులకు ఇచ్చే పాసుల జారీలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించాలని అధికారులను ఆదేశించారు. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అవసరమైన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్టేడియం పరిసరాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని సూచించారు. టికెట్ల పంపిణీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డిసిపి మల్కాజ్ గిరి పద్మజ ఐపిఎస్, డీసీపీ కరుణాకర్, ట్రాఫిక్ డీసీపీ 1 మనోహర్, అడ్మిన్ డీసీపీ ఇందిర, అదనపు డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you