Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 అయోధ్యకు వెళ్తున్న రజనీకాంత్

Must read

తెలంగాణ వీణ , సినిమా : ఎన్నో దశాబ్దాలుగా కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్తున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య లత, సోదరుడు సత్యనారాయణ కూడా వెళ్లనున్నారు. ఈ వేడుకకు హాజరు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్వాహకులు రజనీకాంత్ కు స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత 23వ తేదీన ఆయన తిరిగి చెన్నైకు చేరుకుంటారు. ఈ కుంభాభిషేక కార్యక్రమానికి 8 వేల మందిని ఆహ్వానించారు. వీరిలో 3,500 మంది సాధువులు ఉన్నారు. కార్యక్రమానికి హాజరవుతున్న 8 వేల మందికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వసతితో పాటు అన్ని ఏర్పాట్లను చేస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you