Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కేసీఆర్ ఇంటికో పోయే సమయం వచ్చేసింది.. బై బై కేసీఆర్

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని… ఇక సూట్ కేస్ సర్దుకోవడమేనని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు హైప్ రావడం వల్ల కేసీఆర్ ను దించే అవకాశం ఆ పార్టీకి వచ్చినందువల్ల ఆ పార్టీకి తాము మద్దతుగా నిలిచామని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆత్మహత్యా సదృశం అయినప్పటికీ… కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చకూడదనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేయలేదని అన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు కాబట్టి… తాము కాంగ్రెస్ కు మద్దతిచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్ల అయినా కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలనుకున్నానని తెలిపారు. తన సొంత పార్టీ వాళ్లే తనను విమర్శించినా, దూషించినా, వీడినా కేసీఆర్ ను ఓడించడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తనను వీడిన వాళ్లు కేసీఆర్ తో చేతులు కలపడం తనను బాధించిందని అన్నారు. కేసీఆర్ పై ఎంతో పోరాటం చేసిన తర్వాత మళ్లీ ఆయనతో ఎందుకు కలిశారని ప్రశ్నించారు. 
కేసీఆర్ ప్యాకప్ చేసుకునే సమయం, ఇంటికి పోయే సమయం వచ్చిందని… ఆయనకు ఎండ్ కార్డ్ పడబోతోందని షర్మిల చెప్పారు.  ఆయనకు ఒక గిఫ్ట్ ఇస్తున్నామంటూ… ‘బై బై కేసీఆర్’ అని రాసి ఉన్న సూట్ కేసును చూపించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసే ఉన్నాయనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందని చెప్పారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you