అనారోగ్య కారణంగా మృతి చెందిన డాక్టర్ శివారపు జనార్ధన్ కుటుంబాన్ని పరామర్శించి మానవత్వం చాటుకున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం
ములుగు జిల్లా అధ్యక్షులు బట్ట మురళీకృష్ణ ఉపాధ్యక్షులు మంచెర్ల నాగేశ్వరరావు
తెలంగాణ వీణ, ములుగు : ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఎర్రలవాడలో నివసిస్తున్న డాక్టర్ శివారపు జనార్దన్ గత ఆరు నెలల నుంచి తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతూ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారని.డాక్టర్ జనార్దన్ ఏటూరునాగారం ప్రజలకు 25 సంవత్సరాలుగా తన వృత్తిపరంగా వైద్యం చేస్తూ చాలామందికి రోగాలను తగ్గించేవాడని ఏటూరునాగారం ప్రజలందరికీ అందుబాటులో ఉంటు కలినడకనే తిరుగుతూ ప్రజలకు వైద్యం చేసే వారని అతని అకాల మరణం ప్రజలకు తీరనిలోటని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు బట్ట మురళీకృష్ణ అన్నారు.అకాల మరణం చెందిన డాక్టర్ జనార్ధన్ కుటుంబాన్ని ఈరోజు పరామర్శించి వారి కార్యక్రమాల నిమిత్తం క్వింటా బియ్యం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బట్టగోపి,
ఏటునాగరం మండల
ప్రధాన కార్యదర్శి ఇర్సవడ్ల కిరణ్,
మండల బిసి నాయకులు
,బండారి రాము ఎర్రల నాగరాజు
బట్ట కొమరయ్య కోసంగి రాంబాబు పెద్ద బోయిన సమ్మయ్య, మాటూరి పాపయ్య,ఎర్రల నారాయణ, మంచెర్ల గౌరయ్య, కొంకతి కృష్ణ, కొడెం సాయి తాండ్ర బక్కయ్య కొంకతి వెంకట్ నర్సయ్య పాల్గొన్నారు.