Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

తబ్లీఘీ జమాత్‌కు తెలంగాణ ప్రభుత్వ నిధుల మంజూరు..

Must read

తెలంగాణ వీణ ,హైదరాబాద్ : వచ్చే జనవరిలో వికారాబాద్‌లో జరగనున్న తబ్లీఘీ జమాత్ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇస్లామిక్ సొసైటీ పేరిట పరిగి మండలంలో తబ్లీఘీ జమాత్ నిర్వహించనున్న ఈ మీటింగ్‌లకు రూ.2.45 కోట్లు విడుదల చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతోందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర నిఘా విభాగం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను తుక్డే తుక్డే గ్యాంగ్ ఏం చేయాలనుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రం దివాల తీసిందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తబ్లీఘీ జమాత్ కార్యక్రమానికి నిధులు విడుదల చేయటమేమిటని ప్రశ్నించారు.  తబ్లీఘీ జమాత్ టెర్రరిజంను ప్రోత్సహిస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. సౌదీ అరేబియా, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్, కజకస్థాన్ వంటి దేశాలు తబ్లీఘీని నిషేధించాయని గుర్తు చేశారు. 2020లో భారత్‌లో కరోనా వ్యాప్తికి ఈ సంస్థ నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమాలు ప్రధాన కారణమని ఆరోపించారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో రాష్ట్రంలోకి తబ్లీఘీ జమాత్.. మీటింగుల పేరిట కాలుపెట్టడం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you