Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

వైభవంగా వైకుంఠ ఏకాదశి

Must read

వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు ..
ఆలయాలకు ముక్కోటి శోభ…
తెలంగాణవీణ, హైదరాబాద్ : ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్టవాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశిన ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెబున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకునేందుకు సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రబాబు, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎస్ఎల్ భట్టి, జస్టిస్ శ్యాంసుందర్, జస్టిస్ తారాలా రాజశేఖర్, కర్ణాటక గవర్నర్ ధావర్ ‌చంద్ గెహ్లాట్, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి, ఉష, శ్రీచరణ్, మేరుగు నాగార్జున, చెల్లుబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, రఘురామకృష్ణరాజు, సీఎం రమేశ్, డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు వంటి ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు. తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి విష్ణుమూర్తి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక్కడ జరుగుతున్న వైకుంఠ ఏకాదశి వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాద్రి రామయ్య, వేములవాడ రాజన్న ఆలయాల్లోనూ భక్తులకు స్వామివార్లు ఉత్తర ద్వారం దర్శనమిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you