Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 ఉచిత బస్సు పథకం… ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఆటోలను పెట్టుకోండి

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతోందని భారతీయ మజ్దూర్ సంఘ్-బీఎంఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉండాలని శుక్రవారం వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం అంశంపై వరుసగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. గతంలో డెబ్బై శాతం మంది మహిళలు ఆటోలు ఎక్కేవారని, దీంతో తమకు రోజుకు రూ.1000 వరకు వచ్చేవని, కానీ ఇప్పుడు రూ.300 కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత పథకాలతో తమ పొట్టను కొట్టారని కాబట్టి ఆటోలను ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పెట్టుకోవాలని లేదా బస్సుల సంఖ్య తగ్గించాలని అల్టిమేటం. కేసీఆర్ ప్రభుత్వం రవాణా చట్టానికి విరుద్ధంగా ఓల, ఉబర్ క్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చిందని విమర్శలు గుప్పించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమస్యను పరిష్కరించాలని లేదంటే.. 18వ తేదీన ధర్నాలు, 19న కలెక్టర్లకు వినతి పత్రం సమర్పణ, 20న డిపోల వద్ద శాంతియుత ధర్నా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆ తర్వాత 21, 22 తేదీల్లో ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత పూర్తి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఆటో సంఘాలతో చర్చలు జరిపి న్యాయం చేయకుంటే ఛలో హైదరాబాద్ కూడా నిర్వహిస్తామని హెచ్చరించారు. అవసరమైతే ప్రజా భవన్ ముట్టడిస్తామన్నారు. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you