Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

మంత్రి సీతక్క స్వగ్రామం జగ్గన్నపేటకి బస్సు

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్క స్వగ్రామం జగ్గన్నపేట ప్రజలకు శుభవార్త. త్వరలోనే ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. బస్సు నడిపేందుకు ఆ రూట్‌ను ఆర్టీసీ బుధవారం పరిశీలించింది. వరంగల్-2 డిపోకు చెందిన అధికారులు సర్వే నిర్వహించారు. త్వరలోనే బస్సు నడిపిస్తామని వరంగల్‌-2 డిపో మేనేజర్‌ సురేశ్‌ తెలిపారు. పత్తిపల్లి-పొట్లాపూర్‌ మార్గంలో బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తామని, ఈ మేరకు ఆ రూట్‌లో సర్వే పూర్తి చేశామని వివరించారు. కాగా మంత్రి సీతక్క సొంత గ్రామం జగ్గన్నపేట ములుగు జిల్లాలో ఉంది. ఈ గ్రామానికి రోడ్డు మార్గం ఉన్నప్పటికీ ఆర్టీసీ ప్రస్తుతం బస్సులు నడపటం లేదు. ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో జగ్గన్నపేట గ్రామానికి బస్సులు నడపకపోవడంపై స్థానికంగా చర్చ జరిగింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you