Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

మామిడి, చింత చెట్లు లీజుకు వేలం

Must read

తెలంగాణ వీణ,శామీర్‌పేట: మామిడి, చింత చెట్లు లీజుకు వేలం వేయనున్నట్లు శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ వో శ్రీనివాసరావు, చైర్మన్ మైసయ్య మంగళవారం తెలిపారు. కేశవరం గ్రామ పరిధిలోని సర్వే 81 నెంబర్ లో గల 7 : 30 గుంటల భూమిలో గల 370మామిడి చెట్లు, 25 చింత చెట్లు ఒక సంవత్సరం లీజుకు వేలం వేయడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తిగలవారు ఈ నెల 21 వ తేది 10:30 గంటలకు కేశవరం లోని దేవాలయం వద్ద హాజరు కావాలని కోరారు. వేలం పాటలో పాల్గొనే వారు దేవాదయ శాఖకు రూ 2 వేలు ముందుగా చెల్లించి పాటలో పాల్గొనాలని సూచించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you