Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

హస్తం గూటికి వివేక్​..!

Must read

తెలంగాణ వీణ, హైదరాబాద్‌ : బీజేపీ మెనిఫెస్టో కమిటీ చైర్మన్​, పెద్దపల్లి మాజీ ఎంపి గడ్డం వివేక్​ ఆ పార్టీకి గుడ్​ బై చెప్పారు. బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపిన ఆయన హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని నోవాటెల్‌లో అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో తన కుమారుడు వంశీతో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాహుల్​ గాంధీ వారికి కాంగ్రెస్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చెన్నూరు టిక్కెట్టును కాంగ్రెస్​ వంశీకి ఇచ్చేందుకు సముఖంగా వ్యక్తం చేయగా.. లోక్​సభ ఎన్నికల్లో పెద్దపల్లి స్ధానాన్ని వివేక్​ కు రిజర్వ్​ చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వివేక్​.. తెలంగాణలో బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే కాంగ్రెస్​ తోనే సాధ్యమవుతుందన్నారు. కేసీఆర్​ ను ఓడించేందుకే తాను కాంగ్రెస్​ లో చేరానన్నారు. రాష్ట్రంలో.. కేసీఆర్‌ కుటుంబం తమ ఆకాంక్షల మేరకే పని చేస్తోందని.. కల్వకుంట్ల ఫ్యామిలీకి ప్రజా సంక్షేమం పట్టడం లేదని విమర్శించారు. అయితే గత కొంతకాలంగా వివేక్​ బీజేపీలో అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. గత నెల 24న పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించిన వివేక్​.. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో తాను బీజేపీ నుండి పెద్దపల్లి అభ్యర్ధిగా బరిలో ఉంటాననీ స్పష్టం చేశారు. కానీ ఇటీవల బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలతో అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో.. అనుచరులతో చర్చించిన వివేక్​ సైతం కాంగ్రెస్​ లో చేరారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you