Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ప్రజల భద్రత గాలికి వదిలిన ‘నితిన్‌ సాయి’ కంపెనీ

Must read

తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ప్రజలకు మెరుగైన రహదారులు కల్పించి సుఖవంతమైన ప్రయాణం అందించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రాన్ని ఒప్పించి మరీ ముదిగుబ్బకు బైపాస్‌ రహదారిని మంజూరు చేయించారు. అందులో భాగంగా 2021 డిసెంబర్‌లో రూ.116.81 కోట్ల వ్యయంతో ముదిగుబ్బ నుంచి 7.749 కిలోమీటర్ల పొడవున ఎన్‌హెచ్‌–42 బైపాస్‌ రోడ్డును నిర్మించేలా టెండరు పిలిచారు. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి చెందిన నితిన్‌సాయి  కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ ఈ పనులు దక్కించుకుంది. నిబంధనలకు పాతరేస్తూ బైపాస్‌ రోడ్డు పనుల్లో అంతులేని అక్రజుమాలకు పాల్పడుతోంది.  

నాణ్యత గాలికి..  
బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా నితిన్‌ సాయి కనస్ట్రక్షన్స్‌ ఇటీవల నిర్మించిన బ్రిడ్జి పనులను చూస్తే నాణ్యత తేటతెల్లమవుతోంది. బ్రిడ్జి నిర్మాణంలో నిలువు కాంక్రీట్‌ వాల్‌ వద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. నాసిరకం కాంక్రీట్‌ మిశ్రమం వాడటం వల్లే ఇలా జరిగిందని నిపుణులు చెబుతున్నారు. అలానే బ్రిడ్జి ఉపరితలంలో మట్టికట్ట పనులు లేయర్ల వారీగా సరిగా చేయక పోవడంతో ఇరువైపులా ఉన్న ప్రీకాస్టెడ్‌      కాంక్రీట్‌ వాల్‌ బయటకు ఉబ్బింది. దీంతో నాసిరకం పనులు ఎక్కడ బయటపడతాయోనని కన్‌స్ట్రక్షన్స్‌   కంపెనీ సిమెంట్‌తో ప్లాస్టింగ్‌ చేసి మేకప్‌ చేసింది. 

పట్టించుకోని అధికారులు.. 
ముదిగుబ్బ బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి నాసిరకంగా జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. పైపెచ్చు పనుల నాణ్యతను పరిశీలించకుండానే విడతల వారీగా సదరు కంపెనీకి బిల్లులు మంజూరు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల సైతం నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీతో లాలూచీ పడటంతోనే అవినీతి పెచ్చుమీరుతున్నట్లు తెలుస్తోంది.  

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you