Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 ప్రపంచకప్‌లో ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా భారత్

Must read

తెలంగాణ వీణ జాతీయం : ప్రపంచకప్‌లో భాగంగా నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగుల తేడాతో విజయం సాధించిన భారతజట్టు లీగ్ దశలో అన్ని మ్యాచుల్లోనూ గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ విజయంతో మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచకప్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో అపజయమన్నదే ఎరుగని ఏకైక జట్టుగా తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకుంది. ఈ నెల 15న (బుధవారం) న్యూజిలాండ్‌తో సెమీస్‌లో తలపడనుంది. 

ఈ ప్రపంచకప్‌లో లీగ్ దశలో ఆడిన 9 మ్యాచుల్లోనూ టీమిండియా విజయం సాధించింది. ఇప్పటి వరకు మరే జట్టు ఈ ఘనత సాధించలేదు. 1996లో శ్రీలంక, 2003లో ఆస్ట్రేలియా ఎనిమిదేసి మ్యాచుల్లో విజయం సాధించాయి. టోర్నీలో అజేయంగా నిలిచిన రెండు జట్లు మాత్రమే ఇప్పటి వరకు ప్రపంచకప్ సాధించాయి. 1975, 79లో వెస్టిండీస్, 2003, 2007లో ఈ ఘనత అందుకున్నాయి. ఇప్పుడు భారత్ కనుక ప్రపంచకప్ గెలిస్తే అది మరో చరిత్ర అవుతుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you